Visakhapatnam : బీచ్రోడ్డులో లారీ బీభత్సం
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:28 AM
విశాఖ బీచ్రోడ్డులో ఓ లారీ బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి ఇసుక లోడుతో వచ్చిన లారీ ఫిషింగ్ హార్బర్కు వెళ్లేందుకు...
విశాఖపట్నం/మహారాణిపేట, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): విశాఖ బీచ్రోడ్డులో ఓ లారీ బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి ఇసుక లోడుతో వచ్చిన లారీ ఫిషింగ్ హార్బర్కు వెళ్లేందుకు మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో పందిమెట్ట జంక్షన్కు చేరుకుంది. అక్కడి నుంచి బీచ్రోడ్డులోకి ప్రవేశించే క్రమంలో అదుపుతప్పి రక్షణగోడను ఢీకొట్టి.. చిల్డ్రన్ పార్కులోకి దూసుకెళ్లింది. ప్రమాద స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రక్షణ గోడను లారీ బలంగా ఢీకొట్టడంతో రాళ్లు సమీపంలో వాకింగ్ చేస్తున్న వన్టౌన్ ప్రాంతానికి చెందిన తుపాకుల పెంటారావు తలకు తగలడంతో గాయమైంది.