Krishna River Water Dispute: ఏపీ కోటా ముగిసింది.. తాగునీరూ ఇవ్వొద్దు
ABN , Publish Date - May 15 , 2025 | 02:42 AM
తాగునీటి అవసరాలకు కూడా కృష్ణా నీటిని ఇవ్వొద్దని తెలంగాణ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. అయితే ఏపీ తమ వాటాలోని మిగిలిన నీటిని వాడే హక్కుతో తాగునీటి కోసం 3.75 టీఎంసీలు విడుదల చేయాలని కోరింది.
కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
తీవ్రంగా స్పందించిన ఏపీ
లెక్కలతో సహా వివరణ
3.75 టీఎంసీలు ఇవ్వాలని వినతి
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో ఏపీ తన వాటా నీటిని పూర్తిగా వాడుకుందని... ఇక తాగునీటి అవసరాలకు కూడా నీరు విడుదల చేయవద్దని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)ను తెలంగాణ కోరింది. ఈ నెల 11న కేఆర్ఎంబీకి దీనిపై లేఖ రాసింది. అయితే, ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నెలాఖరు వరకు నీటి సంవత్సరం ఉందని, కేటాయింపుల మేరకు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా దుర్భిక్ష ప్రాంత తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను విడుదల చేయాలని కేఆర్ఎంబీని కోరింది. శ్రీశైలం జలాశయంలో ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 13.16 టీఎంసీలు, నాగార్జునసాగర్లో ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 50.10 టీఎంసీలు కేటాయించారు. దీనిలో ఏపీ శ్రీశైలం జలాశయంలో 3.485 టీఎంసీలు, తెలంగాణ 12.59 ఈఎంసీలు వాడుకున్నాయి. శ్రీశైలం జలాశయంలో ఏపీకి ఇంకా 6.515 టీఎంసీలు, తెలంగాణకు 0.57 టీఎంసీలు, నాగార్జున సాగర్లో ఏపీకి ఇంకా 15.37 టీఎంసీలు, తెలంగాణకు 12.71 టీఎంసీలు మిగిలాయి. వేసవి తీవ్రత నేపథ్యంలో రాష్ట్రానికి 3.75 టీఎంసీలను తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని కేఆర్ఎంబీని రాష్ట్ర జల వనరుల శాఖ కోరింది. తాగునీటి అవసరాలకు కూడా తెలంగాణ అడ్డుపడుతోందని కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. తక్షణమే తమకు తాగునీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News