Share News

Mahanadu Cyclist Journey: ఏడు పదుల వయస్సులో..

ABN , Publish Date - May 30 , 2025 | 02:55 AM

సెప్టంజన వయస్సులోనూ టీడీపీ అభిమానంతో 400 కి.మీ సైకిల్ తొక్కుతూ మహానాడుకు హాజరైన మునేశ్వరరావు పార్టీకి స్ఫూర్తిగా నిలిచారు. చంద్రబాబు వేదికపైకి పిలిచి అభినందించారు.

 Mahanadu Cyclist Journey: ఏడు పదుల వయస్సులో..

  • మహానాడుకు 400 కి.మీ. సైకిల్‌పై ప్రయాణం

కడప, మే 29(ఆంధ్రజ్యోతి): ధూళిపూడి మునేశ్వరరావు... ఏడు పదులు దాటిన వయస్సు ఆయనది. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం కోడూరు స్వగ్రామం. ఈ పెద్దాయన తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. మండేఎండలు, మధ్యలో వర్షాలు... లెక్కేలేదు. అభిమాన ప్రదర్శనకు అడ్డే కాదు. 400 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ కడపలో జరిగిన మహానాడుకు హాజరయ్యారు. పెద్దాయన అభిమానం పార్టీ జాతీయ అధ్యక్షుడి దృష్టికి వెళ్లింది. మునేశ్వరరావుని చంద్రబాబు వేదికపైకి పిలిపించారు. అందరికీ చూపిస్తూ... ‘ఈ పెద్దాయన అందరికీ స్ఫూర్తి ప్రదాత. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి కార్యకర్తలు ఉండటం పూర్వజన్మ సుకృతం’ అని చంద్రబాబు అన్నారు. వేదికపై ఉన్న మంత్రి లోకేశ్‌ లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు.

Updated Date - May 30 , 2025 | 02:57 AM