TDP criticism: ప్రజలు వెన్నుపోటుదారులా
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:24 AM
బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఇచ్చిన తీర్పు వెలువడిన రోజును వెన్నుపోటు దినంగా ప్రకటించి నిరసనలు తెలుపుతున్నారు.
అమరావతి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ఒక రాజకీయ పార్టీగా రాష్ట్రంలో మనుగడ సాగించే అర్హతను వైసీపీ కోల్పోయిందని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఇచ్చిన తీర్పు వెలువడిన రోజును వెన్నుపోటు దినంగా ప్రకటించి నిరసనలు తెలుపుతున్నారు. ప్రజల ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి, వారితోనే ఛీకొట్టించుకున్న జగన్... నేడు అదే ప్రజలను వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తూ నిరసనలు చేయడం ఏమిటి?’ అని ప్రశ్నించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ‘జూన్ 4 కేవలం కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టిన రోజే కాదు. జనసామాన్యానికి సేవ చేయాలనే సంకల్పానికి స్వరం ఇచ్చిన రోజు’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News