Nara Lokesh: లోకేశ్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని టీడీపీ అధిష్ఠానంపై పార్టీ శ్రేణుల ఒత్తిడి
ABN , Publish Date - May 26 , 2025 | 02:02 AM
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ లోకేశ్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని పార్టీ శ్రేణుల ఒత్తిడి పెరుగుతోంది. చంద్రబాబు బిజీగా ఉండడంతో పార్టీ వ్యవహారాలను లోకేశ్ చూసే అవకాశాలు ఉన్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్కు పార్టీలో కీలక పాత్ర అప్పగించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి(వర్కింగ్ ప్రెసిడెంట్)గా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్ఠానంపై పెద్దఎత్తున ఒత్తిడి వస్తోంది. 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడులో ఆయనకు కొత్త బాధ్యతల అప్పగింతపై చర్చించి నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు క్షణం తీరికలేకుండా అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. చంద్రబాబు దృష్టి అంతా ప్రభుత్వంపైనే కేంద్రీకృతం కావడంతో పార్టీలో ఏం జరుగుతోందో నిశితంగా పరిశీలించే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవహరాలను చూసేందుకు లోకేశ్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్పై ట్రాన్స్జెండర్ల దారుణం..
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి