Share News

thermal plant థర్మల్‌ ప్లాంట్‌ ప్రతిపాదనను విరమించుకోవాలి

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:32 AM

సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో 3200 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

 thermal plant థర్మల్‌ ప్లాంట్‌ ప్రతిపాదనను విరమించుకోవాలి
కలెక్టరేట్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న ఆదివాసీలు

శ్రీకాకుళం కలెక్టరే ట్‌, జనవరి 29(ఆంధ్రజ్యోతి): సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో 3200 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. ఈ ప్లాంట్‌ నిర్మాణం జరిగితే సుమారు 30 ఆదివాసీ గ్రామాల పరిధిలో గల రెండువేల మంది బాధితులుగా మారిపోతారన్నారు. ఈ ప్రాంతం మొత్తం దుమ్ము, ధూళితో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడతారన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:32 AM