ఓటు హక్కు మన బాధ్యత
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:57 PM
ఓటు హక్కు మన బాధ్యతని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు.

ఎస్పీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఓటు హక్కు మన బాధ్యతని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందితో శనివారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీ ఎల్.శేషాద్రి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.