enforce the promise హామీలు అమలు చేయడమే ధ్యేయం
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:54 PM
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ అమలచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్మమ ని, సీసీ రోడ్లు నిర్మాణం జరగడం వలన గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.

రణస్థలం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ అమలచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్మమ ని, సీసీ రోడ్లు నిర్మాణం జరగడం వలన గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. జాతీయరహదారికి ఆనుకొని బండిపాలం మీడగా ఉప్పువల గ్రామానికి రూ.1.8 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శనివారం శంకుస్థాన చేశారు. అదేవిధంగా జేఆర్ పురం పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఇటీవల చేపట్టిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. జేఆర్పురం పంచాయతీని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామలరావు, లంక ప్రభ, పిసిని జగన్నాథంనాయుడు, గొర్లె లక్ష్మణరావు, రౌతు అప్పలనాయుడు, నారాయశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.