Share News

GBS Virus: జీబీఎస్‌ కలకలం

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:02 AM

child death సంతబొమ్మాళి మండలం కాపుగోదాయ వలసలో గులియన్‌ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) వైరస్‌ కలకలం రేగింది. ఇటీవల గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు వాతాడ యువంత్‌ ఈ వ్యాధితో మృతి చెందాడని ప్రచారం జరుగు తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

GBS Virus: జీబీఎస్‌ కలకలం
విద్యార్థులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో బాలమురళీ కృష్ణ

  • వైరస్‌తో బాలుడు మృతి చెందాడని అనుమానం

  • డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో గ్రామస్థులకు పరీక్షలు

  • వ్యాధి లక్షణాలు నిర్ధారించాల్సి ఉందని వెల్లడి

  • అంటువ్యాధి కాదని స్పష్టం చేస్తున్న వైద్యులు

  • సంతబొమ్మాళి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం కాపుగోదాయ వలసలో గులియన్‌ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) వైరస్‌ కలకలం రేగింది. ఇటీవల గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు వాతాడ యువంత్‌ ఈ వ్యాధితో మృతి చెందాడని ప్రచారం జరుగు తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో ఈ వైరస్‌తో చాలా మంది మృతి చెందగా ఇటీవల తెలంగాణలో కూడా ఆ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కాపుగోదాయవలసకు చెందిన యువంత్‌కు ఈ వైరస్‌ సోకి మృతి చెందా డన్న అనుమానంతో డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది బుధ వారం గ్రామాన్ని సందర్శించారు. యువంత్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. బాలుడికి నిర్వ హించిన వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి వైద్య పరీ క్షలు నిర్వహించారు. గ్రామంలో జ్వరం, గొంతునొప్పి తదితర లక్షణాలతో బాధపడుతున్న వారి వివరాలను వైద్యులు సేకరించారు. పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వ హించారు. బాలుడు యువంత్‌ జీబీఎస్‌ వైరస్‌తో మృతి చెందాడన్న దానిపై ఇంకా నిర్ధారణ కావల్సి ఉందని డీఎంహెచ్‌వో బాలమురళీ కృష్ణ తెలిపారు. ఇటువంటి వ్యాధి మూడులక్షల మందిలో ఒకరికి సోకుతుందని వెల్లడించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది అంటువ్యాధి కాదని, దీనిపై ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Updated Date - Feb 13 , 2025 | 12:02 AM