Share News

Sports శారీరక ఆరోగ్యానికి క్రీడలు దోహదం

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:52 PM

Sports మాన సికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడ లు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే మామిడి గోవిం దరావు అన్నారు.

Sports శారీరక ఆరోగ్యానికి క్రీడలు దోహదం
జలుమూరు విజేత ఆదివాసీ జట్టుకు బహుమతి అందిస్తున్న దృశ్యం

పాతపట్నం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మాన సికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడ లు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే మామిడి గోవిం దరావు అన్నారు. లాబరగ్రామంలో గ్రామస్థులు శ్రీరాం రమణ, మాధవరావు, లోకేశ్‌ సంయుక్త సార ధ్యంలో నిర్వహించిన మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ శని వారం ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో 48 జట్లు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. విజేతగా లాబర జట్టు, పాతపట్నం జట్టు రన్నర్‌గా నిలి చాయి. విజేతలకు ఎమ్మెల్యే నగదు పురస్కారం అం దించారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన డా. కొండాల చక్రపతిని, క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు.

ముగిసిన క్రికెట్‌ పోటీలు

మెళియాపుట్టి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): వెంకటాపురంలో 10 రోజులుగా జరుగుతున్న అల్లూ రు సీతారామరాజు క్రికెట్‌ టోర్నమెంట్‌ శనివారం ముగిసింది. మర్రిపాడు జట్టు విన్నర్‌గా, వెంకటా పురం జట్టు రన్నర్‌గా నిలిచారు. విజేతలకు నగదు తోపాటు షీల్డ్‌లను అందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ, మర్రిపాడు సర్పంచ్‌ అనురాధ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.

విన్నర్‌గా ఆదివాసీ జట్టు

జలుమూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఎస్టీ మాకివలసలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆదివాసీ జట్టు విజేతగా నిలిచింది. మొత్తం 25 జట్లు పాల్గొనగా ఫైనల్‌కు మాకివలస జట్టు-ఆదివాసీ జట్టు చేరుకోగా ఇరు జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్‌ జరిగింది. విజే తగా ఆదివాసీ జట్టు నిలువగా రన్నర్‌గా మాకివలస జట్టు నిలిచింది. మ్యాన్‌ఆఫ్‌ ది మ్యాచ్‌ సింహాచలం కైవశం చేసుకోగా, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ ఉదయ్‌కు దక్కింది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

Updated Date - Jan 18 , 2025 | 11:52 PM