Settlement మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కారం
ABN , Publish Date - Jan 20 , 2025 | 11:57 PM
మధ్యవర్తిత్వంతె వి వాదాలు పరిష్కారించుకోవచ్చని జిల్లా న్యాయమూర్తి జునైద్ అ హ్మద్ మౌలానా అన్నారు.
జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా
గుజరాతీపేట, జనవరి 20(ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వంతె వి వాదాలు పరిష్కారించుకోవచ్చని జిల్లా న్యాయమూర్తి జునైద్ అ హ్మద్ మౌలానా అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారం అంశంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సో మవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. న్యాయ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడానికి మ ధ్యవర్తిత్వం ఒక మార్గమన్నారు. మఽధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్ కేసులు సత్వర పరిష్కారానికి ఈ శిక్షణ తోడ్పడుతుందన్నారు. జిల్లాలోని వివిధ బార్ అసోసియేషన్ల నుంచి ఎంపిక చేసిన పలువురు న్యాయవాదులు ఈ శిక్షణకు హాజరయ్యారు. జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు అధ్యక్ష తన జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సి లియేషన్ ప్రాజెక్టు కమిటీ (ఎంసీపీసీ) సభ్యులు అనూజా సక్సే నా, వీణా రళ్లి మాస్టర్ శిక్షకులుగా వ్యవహరించగా, న్యాయ వాదులు పాల్గొన్నారు.