రూ.350 కోట్లతో గ్రామీణ రోడ్లు: మంత్రి
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:23 PM
:ఉపాధి హామీ పథకం ద్వారా రూ.350 కోట్లతో రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల పనులు చేపడుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం గజపతినగరం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి పను లు పరుగులు తీస్తున్నాయన్నారు. గజపతినగరం నియోజకవర్గం పరిధిలో బొండపల్లి మండలంలో తాగునీటిసమస్య తలెత్తకుండాపనులు వేగవంతంగా జరిగేలా అదికారు లకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.

గజపతినగరం, జనవరి12 (ఆంధ్రజ్యోతి):ఉపాధి హామీ పథకం ద్వారా రూ.350 కోట్లతో రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల పనులు చేపడుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం గజపతినగరం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి పను లు పరుగులు తీస్తున్నాయన్నారు. గజపతినగరం నియోజకవర్గం పరిధిలో బొండపల్లి మండలంలో తాగునీటిసమస్య తలెత్తకుండాపనులు వేగవంతంగా జరిగేలా అదికారు లకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ మం డలాలకు ఆర్టీసి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గజపతినగరం మండలంలోని మరుపల్లిలో 80 ఎకరాల్లో ఫుడ్పార్క్ నిర్మాణాలు చేప ట్టేలా చర్యలుతీసుకోవడంతోపాటు అదనంగా వందఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్కు ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు. బొండపల్లి మండలంలో 50 ఎకరాలు స్థల సేకరణ చేపట్టి పరిశ్రమల ఏర్పాటకు ప్రతిపాదనలు చేశామన్నారు. గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ ఆధునికీకరణ పనులతోపాటు పర్యాటకాన్ని అభివృద్ధిచేశామన్నారు. రైతులకు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను చెల్లింపులు చేపట్టడంతో పాటు ధాన్యం ఇచ్చిన రైతులకు 48గంటల్లో వారి ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. మూడు లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా సంక్రాంతికి ముందే 70శాతం కొనుగోలు చేశామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీవీవీ గోపాలరాజు, నాయకులు శీరం రెడ్డి రామ్కుమార్, ప్రదీప్ కుమార్, లెంక బంగారునాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మక్కువ శ్రీధర్, దత్తిరాజేరు టీడీపీ మండలాధ్యక్షులు చప్పా చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
దత్తిరాజేరు, జనవరి 12(ఆంధ్రజ్యోతి):మండలంలోని చుక్కపేటకు చెందిన పొల సత్యనారాయణకు సీఎంఆర్ఎఫ్చెక్కును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం అం దజేశారు.హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల విశాఖలో చికిత్స పొం దారు. ఈమేరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి విడుదలైన రూ.2 లక్షల చెక్కును ఆదివారం అందజేశారు.
కొత్త బస్సులు పెంచేందుకు చర్యలు
విజయనగరం, రింగురోడ్డు జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీకి బస్సులు కొరత ఉందని, కొత్త బస్సులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం ఆర్టీసీ డిపోలో నాలుగు బస్సులను ఆదివారం రాత్రి ప్రారంభించారు. విజయనగరం నుంచి పార్వతీపురం రూట్, శ్రీకాకుళం రూట్ లో రెండు బస్సుల చొప్పున నడవనున్నాయి. ఈ సందర్బంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలోని జోనల్ చైర్మన్ దొన్ను దొర, డీపీటీవో సీహెచ్ అప్పలనారాయణ పాల్గొన్నారు.