Kumbh Mela : 12న కుంభమేళాకు ఆర్టీసీ సర్సీసు
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:43 PM
Kumbh Mela: ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఈ నెల 12న ప్రత్యేక ఆర్టీసీ బస్సును నడపనున్నట్లు సంబంధిత అధికా రులు తెలిపారు.
అరసవల్లి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఈ నెల 12న ప్రత్యేక ఆర్టీసీ బస్సును నడపనున్నట్లు సంబంధిత అధికా రులు తెలిపారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకు ళం ఆర్టీసీ కార్యాలయంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుంభ మేళా యాత్ర కోసం సరికొత్త సూపర్ లగ్జరీ (పుష్ బ్యాక్) బస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 7 రోజుల్లో 7 క్షేత్రాలను సందర్శించే విధంగా ప్రణాళిక రూపొందిం చామన్నారు. ప్రయాణికులకు మధ్యాహ్నం భోజనం, ఉదయం, రాత్రి అల్పాహారం అందిస్తామన్నారు. ఇప్ప టికే టిక్కెట్లు రిజర్వ్ అయ్యాయని, మరో 20 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెప్పారు. బస్సును బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే పంపిస్తామన్నారు. మనిషి ఒక్కరికి రూ.9,500 చార్జీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 9959225609, 7382917289, 7382921647, 7382921810 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్లు అమరసింహుడు, కె.రవిశంకర్ శర్మ, ఏఎన్ఎస్.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.