RTC ప్రయాణికులతో ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:36 AM
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం సాయంత్రం ప్రయాణికులతో కిటకి టలాడింది.

అరసవల్లి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం సాయంత్రం ప్రయాణికులతో కిటకి టలాడింది. మాఘమా సం ఆదివారం ఆది త్యుని దర్శనానికి వచ్చే భక్తులు, గ్రూప్-2 పరీక్ష లకు హాజరైన అభ్యర్థులు, వత్సవలస రాజమ్మ జాతరకు తరలివచ్చిన యాత్రీకులు, పెద్ద సంఖ్యలో జరిగిన పెళ్లిళ్లకు హాజరైనవారితో కాంప్లెక్స్ పరిసరాలు నిండిపోయాయి. విశాఖ వెళ్లే నాన్స్టాప్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఆర్టీసీ అధికారులు రద్దీకి అనుగుణంగా అవసరమైన రూట్లలో బస్సులను నడిపించారు.