డీపట్టా భూముల్లో స్తంభాల తొలగింపు

ABN , First Publish Date - 2025-05-28T23:31:15+05:30 IST

మండలంలోని అన్నంపేటలో కొందరి డీపట్టా భూము ల్లో ఫెన్సింగ్‌ కోసం పాతిపెట్టిన సిమెంట్‌ స్తంభాలను వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు బుధవారం తొలగించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం మాట్లాడుతూ గ్రామంలో తర తరాలుగా సాగులోఉన్న 25ఎకరాల్లో ఓ వ్యక్తి కొంతమందితో యంత్రాలతో చదును చేసి సిమెంట్‌ స్తంభాలను చుట్టూ పాతారని తెలిపారు.ఈనెల 21న తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పేదలతో ధర్నా చేశామన్నారు.

డీపట్టా భూముల్లో స్తంభాల తొలగింపు
సిమెంట్‌ స్తంభాన్ని తొలగిస్తున్న దృశ్యం

బూర్జ, మే 28(ఆంధ్రజ్యోతి):మండలంలోని అన్నంపేటలో కొందరి డీపట్టా భూము ల్లో ఫెన్సింగ్‌ కోసం పాతిపెట్టిన సిమెంట్‌ స్తంభాలను వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు బుధవారం తొలగించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం మాట్లాడుతూ గ్రామంలో తర తరాలుగా సాగులోఉన్న 25ఎకరాల్లో ఓ వ్యక్తి కొంతమందితో యంత్రాలతో చదును చేసి సిమెంట్‌ స్తంభాలను చుట్టూ పాతారని తెలిపారు.ఈనెల 21న తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పేదలతో ధర్నా చేశామన్నారు. దళితులకు డీపట్టాలు ఇవ్వడం వాస్తవమని తేలిందని, ఆ డీపట్టా ఉన్న భూములను వారు సాగు చేసుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో పొన్నాడ గౌరమ్మ, దంతా శ్రీరాము, దన్నాన లక్ష్మి, సాకేటి అప్పారావు భట్న గణపతి, మజ్జి సూర్యనారాయణ, కూరాకు లక్ష్మి, నేతల వెంకటమ్మ, సాకేటి రమణమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2025-05-28T23:31:17+05:30 IST