మొదటి ప్రాధాన్య ఓటు వేసేలా వివరించండి
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:45 PM
కూటమి ప్రభుత్వం బలపరిచిన ఉత్త రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఈనెల 27న జరగ నున్న పోలింగ్లో మొదటిప్రాధాన్యత ఓటువేసేలా ఉపాధ్యాయులకు వివరించాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు.

రణస్థలం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం బలపరిచిన ఉత్త రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఈనెల 27న జరగ నున్న పోలింగ్లో మొదటిప్రాధాన్యత ఓటువేసేలా ఉపాధ్యాయులకు వివరించాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. ఈమేరకు రఘువర్మను గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై రణస్థలంలో ఎంపీ తనకార్యాలయంలో సోమవారం సమీక్షించారు.సమావేశంలో ఎన్నికల పరిశీలకుడు ఆనెపు రామకృష్ణ, టీడీపీ మం డలాధ్యక్షుడు లంకశ్యామ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సర్పంచ్ల సంఘం అధ్య క్షులు పిన్నింటి భానూజీనాయుడు, సోమినాయుడు, గొర్లె లక్ష్మణరావు పాల్గొన్నారు.