ఆలయాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే శంకర్
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:46 PM
: వీర వసంత ఈశ్వర స్వామి తదితర ఆల యాల అభివృద్ధికి కృషిచేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. సోమవారం శాలిహుండాం వద్ద గల శ్వేతగిరిపై వెలసిన వీర వసంత ఈశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మహేంద్రాడ రవికుమార్, వేద పండితులు, స్వాగతం పలికారు.

గార ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): వీర వసంత ఈశ్వర స్వామి తదితర ఆల యాల అభివృద్ధికి కృషిచేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. సోమవారం శాలిహుండాం వద్ద గల శ్వేతగిరిపై వెలసిన వీర వసంత ఈశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మహేంద్రాడ రవికుమార్, వేద పండితులు, స్వాగతం పలికారు.
ఫ శ్వేతగిరిపై వీర వసంత ఈశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం, లక్ష్మీనరసింహ, దత్తాత్రేయ స్వామి ఆలయాల శిఖరప్రతిష్ఠ కార్యక్రమాలు సోమ వారంవైభవంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మహేంద్రాడ రవి కుమార్, వసుంధర దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండ భాస్కరరావు, సర్పంచ్ కె.ఆదినారాయణ పాల్గొన్నారు.