దేహదారుఢ్య పరీక్షల్లో 317 మంది అర్హత
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:45 PM
ఎచ్చెర్ల సాయుధ పోలీసు మైదానంలో కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో 317 మంది అర్హత సాధించారు.

ఎచ్చెర్ల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల సాయుధ పోలీసు మైదానంలో కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో 317 మంది అర్హత సాధించారు. 727 మంది హాజరు కావల్సి ఉండగా, 478 మంది హాజరయ్యారు. ఇందులో 317 మంది అర్హత సాధించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ కొనసాగింది.