Share News

AP schools: 9 నుంచి టీచర్లకు పాఠశాల సన్నద్ధత శిక్షణ

ABN , Publish Date - Jun 05 , 2025 | 06:47 AM

ఆ పంట ఉత్పత్తులను వినియోగిస్తే మనుషులకూ ప్రమాదం.. మనలో కాలేయం, ప్రత్యుత్పత్తి వ్యవస్థలపై తీవ్ర ప్రభావం కూడా.. ఇలాంటి విషపూరిత ఫంగ్‌సను అమెరికాలోకి అక్రమంగా తీసుకెళ్తూ ఇద్దరు చైనా పరిశోధకులు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకి పట్టుబడ్డారు.

AP schools: 9 నుంచి టీచర్లకు పాఠశాల సన్నద్ధత శిక్షణ

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లకు ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు పాఠశాలల సన్నద్ధత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వం ఇంతకుముందు జారీ చేసిన ఆదేశాల ప్రకారం... ఈ పాఠశాలల రెడీనెస్‌ ప్రోగ్రాం కోసం గురువారం నుంచే ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఈనెల 9 నుంచి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 06:53 AM