Andhra Pradesh Ports: ఏపీ ఓడరేవులను అభివృద్ధి చేయండి
ABN , Publish Date - May 15 , 2025 | 04:15 AM
ఏపీలోని ఓడరేవులు, షిప్పింగ్ హార్బర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ను కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్నాయుడు కోరారు. శ్రీకాకుళం జిల్లాలో నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపై చర్చించి, ఏపీని లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి సోనోవాల్కు రామ్మోహన్నాయుడు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, మే14(ఆంధ్రజ్యోతి): ఏపీలోని ఓడరేవులు, షిప్పింగ్ హార్బర్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పిం గ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్కు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్నాయుడు విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర రవాణా శాఖ కార్యాలయంలో సోనోవాల్ను ఏపీ ప్రభుత్వ అధికారులతో కలిసి కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు కలిశారు. ఈ భేటీలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో నౌకాశ్రయం, ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు. లాజిస్టిక్స్ హబ్గా ఏపీని అభివృద్థి చేయాలన్న దిశగా ఉప్పు భూములను గుర్తించి వాటిని సమర్థంగా వినియోగించాల్సిన అవసరం ఉందని సోనోవాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఓడరేవుల అభివృద్ధి ద్వారా మెరైన్ ఇన్నోవేషన్కు ఏపీ కేంద్ర బిందువుగా మారేలా చర్యలు తీసుకోవాలని కోరామని మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News