MLC elections: ఓటు వేసేందుకు అవకాశం కల్పించండి
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:11 AM
రాష్ట్రంలోని 16 జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఆయా జిల్లాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక అనుమతులు, సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలు ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలు విజ్ఞప్తి
తెనాలి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 16 జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఆయా జిల్లాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక అనుమతులు, సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలు ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొలసాని తులసీ విష్ణుప్రసాద్, ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్-(డెమోక్రటిక్) అధ్యక్షుడు గొల్లపూడి మోహనరావు, ఇండిపెండెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్బాబు మంగళవారం దీనిపై ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను అందించినట్టు పేర్కొన్నారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News