Fee Reimbursement: ఫీజు బకాయిలు విడుదల చేయాలి
ABN , Publish Date - May 23 , 2025 | 05:46 AM
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను త్వరగా విడుదల చేయాలని, 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం కోరింది. పూర్వ కాలానికి సంబంధించిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ప్రైవేట్ కళాశాలలు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయని తెలిపింది.
ప్రభుత్వానికి ఏపీపీఈసీఎంఏ విజ్ఞప్తి
అమరావతి, గుంటూరు కార్పొరేషన్, మే 22( ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సకాలంలో విడుదల చేయాలని, రాబోయే విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏపీపీఈసీఎంఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం అసోసియేషన్ తరపున ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా అపెక్మా అధ్యక్షుడు వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రస్తుత 2024-25 విద్యా సంవత్సరంతో పాటు 2023-24 విద్యా సంవత్సరం, అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2023-24కు సంబంధించి మూడు వాయిదాలు, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు వాయిదాలతో పాటు అంతకు ముందు నుంచి వున్న పీజీ కోర్సుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చాలా వరకు పేరుకుపోయాయని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులను ఖరారు చేసి అడ్మిషన్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News