Visakhapatnam visit: రాష్ట్రపతి విశాఖ పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు
ABN , Publish Date - May 31 , 2025 | 04:50 AM
జూన్ 10న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నంలో గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. కార్యక్రమ ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అధికారులకు సీఎస్ ఆదేశం
అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): జూన్ 10న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నంలో జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్ శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ప్రకారం జూన్ 10వ తేదీ ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి విమానంలో విశాఖపట్నం చేరుకుంటారని, మధా హ్నం 3 గంటల వరకూ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని, ఆ తర్వాత 3.20 గంటలకు విమానంలో ఝార్ఖండ్ రాష్ట్ర పర్యటనకు వెళతారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News