సీఎం రిలీఫ్ ఫండ్తో సకాలంలో వైద్యం
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:01 PM
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందికి సకాలంలో వైద్యం అందుతోందని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ పరిధిలోని 16 మందికి రూ.20,89,377 చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య అందజేశారు.

ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందికి సకాలంలో వైద్యం అందుతోందని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ పరిధిలోని 16 మందికి రూ.20,89,377 చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య అందజేశారు. థామ్సపేటకు చెందిన మల్లెపోగు అనితకుమారికి రూ.86,814, గొల్లపాలెంకు చెం దిన చుక్కా కృష్ణకు రూ.1,77,790, ఈపురుపాలెంకు చెందిన ఎన్.శ్రీలేఖకు రూ.2,33,962, వాడరేవుకు చెందిన యాకోబుకు రూ.60వేలు, ఈపురుపాలెంకు చెం దిన కుమార్రాజాకు రూ.40వేలు, షేక్ బుడేకు రూ.17,101, పి.హాసినికి రూ.26,218, కె.అశ్వినికి రూ.30వేలు, సీహెచ్ ఏడుకొండలకు రూ.49,258లు, మణికంఠకు రూ.31,377, అభినవ్కు రూ. 2,50,000, పాపరాజుతోటకు చెందిన సాం బశివరావుకు రూ.40,166, వేటపాలెంకు చెందిన యానాదిరావుకు రూ.3,03,678, రామకృష్ణాపురానికి చెందిన బాలచంద్రశేఖర్కు రూ.1,20,550, దేవాంగపురికి చెందిన జితేంద్రకుమార్కు రూ.1,20,283, పాతచీరాలకు చెందిన కె.భవి్షరెడ్డికి రూ.5లక్షలు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే కొండయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.