Share News

ఎస్టీలపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలి

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:39 AM

మండలంలో ని బక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన యానాది కు ల మహిళలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం చీమకుర్తి తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించారు.

ఎస్టీలపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలి

ప్రజాసంఘాల నాయకుల డిమాండ్‌

చీమకుర్తి, మార్చి6(ఆంధ్రజ్యోతి) : మండలంలో ని బక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన యానాది కు ల మహిళలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం చీమకుర్తి తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించారు. అణగారిన కు లాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు పేరం శ్రీని వాసరావు అద్యక్షతన జరిగిన ధర్నాలో ఎరుకలహ క్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ఎం.ధర్మ, కేఎన్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దుడ్డు వెంకట్రావు, గిరి జన ప్రజాపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం, ఎంఆర్‌పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ తొరటి ఆనంద్‌ మాదిగ ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. ఎస్టీలపై హేయమైన రీతిలో దాడి నిర్వహించటమే కాక తిరిగి బాధితులపై పెట్టిన తప్పుడు కేసులను వెం టనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్టీ మ హిళలకు తగిన సత్వరన్యాయం జరగకపోతే ఉద్య మాన్ని ఉధృతం చేస్తామన్నారు. తదుపరి తహసీ ల్దార్‌ బ్రహ్మయ్యకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు బి.ర ఘురామ్‌, రావినూతల కోటి, పాలడుగు విజయేం ద్ర, దాసరి సుందరం, చావలి సుధాకర్‌, కౌన్సిలర్‌ పాటిబండ్ల గంగయ్య, దాసరి రవి, రాంబాబు, వీ రాంజనేయులు, పిన్నిక శ్రీనివాస్‌, చింతలపాలెం యలమందబాబు, వంశీ, ఇస్తర్ల శంకర్‌, జంగాల కోటేశ్వరరావు, బత్తుల మల్లిఖార్జునరావు తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:39 AM