Share News

అంకమ్మ తల్లి విగ్రహానికి సూర్యకిరణాభిషేకం

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:43 AM

మండలంలోని ద్రోణాదుల గ్రామంలో అంకమ్మ దేవత శక్తి క్షేత్రంలో గురువారం ఉదయం అంకమ్మ తల్లి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఏటా మార్చిలో అమ్మవారి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తున్నదని ప్రధాన పూజారి అళహరి పూర్ణచంద్రరావు తెలిపారు.

అంకమ్మ తల్లి విగ్రహానికి సూర్యకిరణాభిషేకం
అంకమ్మతల్లి విగ్రహాన్ని తాకిన భానుడి కిరణాలు

మార్టూరు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ద్రోణాదుల గ్రామంలో అంకమ్మ దేవత శక్తి క్షేత్రంలో గురువారం ఉదయం అంకమ్మ తల్లి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఏటా మార్చిలో అమ్మవారి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తున్నదని ప్రధాన పూజారి అళహరి పూర్ణచంద్రరావు తెలిపారు. ఆలయంలో ఈ దృశ్యాన్ని భక్తులు చూసి పరవశించిపోయారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

Updated Date - Mar 07 , 2025 | 01:43 AM