పేదలకు అన్నదానం
ABN , Publish Date - Feb 02 , 2025 | 11:28 PM
ప్రవాసాంధ్రుడు, నియోజకవర్గ జనసేన పార్టీ యువనాయకుడు మన్నెం శ్రీకాంత్ ఆధ్వర్యంలో కారంచేడులో డొక్కా సీతమ్మ పేరుతో ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి విశేష స్పం దన లభించింది.
కారంచేడు(పర్చూరు), ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : ప్రవాసాంధ్రుడు, నియోజకవర్గ జనసేన పార్టీ యువనాయకుడు మన్నెం శ్రీకాంత్ ఆధ్వర్యంలో కారంచేడులో డొక్కా సీతమ్మ పేరుతో ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి విశేష స్పం దన లభించింది. కాల్వసెంటర్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎస్సై వెంకట్రావు, టీడీపీ మండలపార్టీ అధ్యక్షుడు తిరుములశెట్టి శ్రీహరి, జనసేన నాయకులతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో నారిశెట్టి ప్రవీణ్ కుమార్ రామకృష్ణ స్వామి, ప్రతీఫ్ జ్యోతి, పవన్కుమార్, కిషోర్బాబు, రామకృష్ణారెడ్డి, అశోక్ పాల్గొన్నారు.