ఆర్టీసీ ఆదాయం పెంపునకు కృషి చేయాలి
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:28 PM
చదువుతో పాటు క్రీడలపై యువత దృష్టి సారించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని మాజీ ఎమ్మెల్యే నార పుశెట్టి పాపారావు, టీడీపీ నియోజకవర్గ నాయ కుడు డాక్టర్ కడియాల లలిత్సాగర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళా శాల ఆవరణలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొట్టిపాటి-నారపుశెట్టి మెగా టోర్నమెంట్ను వారు ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ మచ్చలేని నాయకులైన మాజీ మంత్రి గొ ట్టిపాటి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే నార పుశెట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ను ఏర్పాటుచేయటం ఆనందంగా ఉందన్నారు.

డీఎం రామ్మోహనరావు
కండక్టర్లు, డ్రైవర్లకు నగదు అవార్డులు అందజేత
అద్దంకి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు సిబ్బంది మరింత కృషి చేయాలని డిపో మేనేజర్ బెల్లం రామ్మోహనరావు అన్నారు. డిసెంబర్లో ఎక్కువ ఈపీకే తీసుకు వచ్చిన కండక్టర్లు ఎం.ఏశేషయ్య, యూఎస్ రావు, మహేశ్వరి, ఎక్కువ కేఎంపీ తీసుకువచ్చిన డ్రైవర్లు బి.శ్రీరాములు, ఎంఎస్ మణ్యంకు మంగళవారం గ్యారెజ్లో జరిగిన కార్యక్రమంలో క్యాష్ అవార్డులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ మహబూబి, సిబ్బంది పాల్గొన్నారు.