తీరనున్న తాగునీటి సమస్య
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:36 AM
ఎర్రగొండపాలెం మేజరు పంచాయతీలో శివారు కాలనీలైన ఎన్టీఆర్కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి పైపులైన్ నిర్మాణపు పనులు ప్రారంభించారు.

ఎర్రగొండపాలెం, ఫిబ్రవరి (ఆంధ్రజ్యోతి) 13: ఎర్రగొండపాలెం మేజరు పంచాయతీలో శివారు కాలనీలైన ఎన్టీఆర్కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు టీడీపీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు జోక్యంతో గురువారం పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి పైపులైన్ నిర్మాణపు పనులు ప్రారంభించారు. ఈ పనులకు గ్రామపంచాయతీ నిధులు నుంచి రూ.3 లక్షలు నిధులు ఖర్చు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి తెలిపారు. ఈ పైపులైన్ నిర్మాణంతో ఎన్టీఆర్ కాలనీ, ఇందిరమ్మకాలనీ, బలపాలప్యాక్టరీ కాలనీలకు సాగర్జలాలతో తాగునీటి సమస్య తీరుతుందని తెలిపారు. తాగునీటి సమస్య తీర్చాలని ఇటీవల రెండు కాలనీల మహిళలు ఖాళీ బిందెలతో ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన విషయం విదితమే.