Share News

ఆర్యవైశ్యులకు అండగా ఉంటా

ABN , Publish Date - Feb 09 , 2025 | 10:30 PM

చీరాల నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులకు అండగా ఉండి, వారి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌వీఎ్‌సఎ్‌సజేఆర్‌ ఆర్యవైశ్య కల్యాణ మండపం ఆధునీకీరణలకు సంబంఽధించి భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఆర్యవైశ్యులకు అండగా ఉంటా
ఆధునీకీరణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య

ఎమ్మెల్యే కొండయ్య

చీరాలటౌన్‌, ఫిబ్రవరి9 (ఆంధ్రజ్యోతి) : చీరాల నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులకు అండగా ఉండి, వారి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌వీఎ్‌సఎ్‌సజేఆర్‌ ఆర్యవైశ్య కల్యాణ మండపం ఆధునీకీరణలకు సంబంఽధించి భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్నట్లు చెప్పారు. సమస్యలు నేరుగా ఆయన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలాగే ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూల్లో జరుగుతున్న ఫుట్‌బాల్‌ పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 10:30 PM