YS Sharmila: ఆపరేషన్ సిందూర్ హర్షణీయం
ABN , Publish Date - May 08 , 2025 | 06:14 AM
పాక్ ఉగ్రవాద స్థావరాలపై సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్టు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. ఈ దాడులను ఆమె గర్వంగా స్వాగతించారు
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): పాక్ ఉగ్రవాద స్థావరాలపై సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేయడం హర్షణీయమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పాక్పై భారత సైన్యం చేస్తున్న ప్రతిదాడులను ఆమె బుధవారం ఆమె ఎక్స్ వేదికగా స్వాగతించారు. ఇది భారత సైన్యానికి గర్వకారణమన్నారు. జై హింద్ జై భారత్ అన్నారు.