Political Criticism: విజనరీకి స్వాగతం చెప్పిన సుదినమిది
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:17 AM
అనంతపురంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విధ్వంసకారుడు జగన్ను తరిమికొట్టి... విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి స్వాగతం చెప్పిన సుదినం 2024 జూన్ 4.
అనంతపురం, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ‘వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి. వెన్నుపోటు గురించి ఆయన మాట్లాడటం హాస్యాస్పదం’ అని మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు ఎద్దేవా చేశారు. అనంతపురంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విధ్వంసకారుడు జగన్ను తరిమికొట్టి... విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి స్వాగతం చెప్పిన సుదినం 2024 జూన్ 4. మా ప్రభుత్వాన్ని, నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వెన్నుపోటు దినమని పిలుపునివ్వడం జగన్ రాక్షస, సైకో, నేరపూరిత మనస్తత్వానికి నిదర్శనం’ అని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News