Share News

Pilgrimage : మహా కుంభమేళాలో మంత్రి సత్యకుమార్‌

ABN , Publish Date - Feb 23 , 2025 | 03:46 AM

మహా కుంభమేళాలో పుణ్యస్నానం ద్వారా కలిగే అనుభవం అనిర్వచనీయమైనదని రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు.

Pilgrimage : మహా కుంభమేళాలో మంత్రి సత్యకుమార్‌

ABN AndhraJyothy: మహా కుంభమేళాలో పుణ్యస్నానం ద్వారా కలిగే అనుభవం అనిర్వచనీయమైనదని రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. శనివారం ఉదయం ఆయన పవిత్ర గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ పవిత్ర స్నానం తనను అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవంతో పులకింప చేసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తొలుత ఆయన కేంద్ర జలశక్తి మంత్రి ఎస్‌.దేవ్‌సింగ్‌తో భేటీ అయ్యారు.

- అమరావతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 23 , 2025 | 03:46 AM