‘కాశినాయన జ్యోతి క్షేత్రాన్ని కాపాడుకోవాలి’
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:34 AM
కాశినాయన జ్యోతి క్షేత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి అన్నారు.
నంద్యాల కల్చరల్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): కాశినాయన జ్యోతి క్షేత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాల వీహెచ్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశిం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మార్చి 7వ తేదీన జ్యోతి క్షేత్రంలో ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన శౌచాలయాలను అటవీశాఖ అధికారులు కూల్చివేశారన్నారు. అయితే ఈ సందర్భంగా నెలకొన్న ఆందోళనకర పరిస్ధితులకు క్షమాపణ కోరుతూ ఆ నిర్మాణాలను తన సొంత నిధులతో పునర్మిస్తామని మంత్రి లోకేశ్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్, ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్రెడ్డి, శేషసాయి, నాగరాజు, విశ్వనాఽథరెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.