వైభవంగా జగన్నాథ రథయాత్ర
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:04 AM
నారదముని భక్త బృందం ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది.
నందికొట్కూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): నారదముని భక్త బృందం ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది. గురువారం సాయంత్రం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రారంభమై వాసవి కల్యాణ మండపం నుంచి పటేల్ సెంటర్ మీదుగా చౌడేశ్వరి దేవాలయం వరకు ఈ రథయాత్ర సాగింది. ఈ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.