తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు: ఎమ్మెల్యే
ABN , Publish Date - May 02 , 2025 | 01:35 AM
వేసవిలో తాగునీటి ఎద్డడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
జూపాడుబంగ్లా, మే 1(ఆంధ్రజ్యోతి): వేసవిలో తాగునీటి ఎద్డడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. మండలంలోని 80 బన్నూరు గ్రామంలో గురువారం 40వేల లీటర్ల సామ ర్థ్యంతో రూ.43 లక్షలు జలజీవన్ మిషన్ కింద మంజూరైన తాగునీటి ట్యాంకు నిర్మాణానికి ముఖ్యఅతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురా వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, కేసీ కాలువ నీటి సంఘం చైర్మన్ పరమే శ్వరరెడ్డి, టీడీపీ నాయకులు నారాయణరెడ్డి, రవికాంత్, శ్రీనివాసులు, వేణుగోపాల్రెడ్డి, సుధాకర్, రవికుమార్యాదవ్, ఎంపీడీవో గోపికృష్ణ, తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్, ఆర్డబ్ల్యూఎస్ఏఈ నాగేంద్ర, పీఆర్ఏఈ బషీర్, ఏపీవో రేష్మా, ఏవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.