Share News

ఘనంగా సరోజిని నాయుడు జయంతి

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:25 AM

స్వాతంత్య్ర ఉద్యమ నాయకురాలు సరోజిని నాయుడు 146వ జయంతిని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సరోజిని నాయుడు జయంతి
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సరోజిని నాయుడు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఉద్యోగులు

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర ఉద్యమ నాయకురాలు సరోజిని నాయుడు 146వ జయంతిని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.ప్రకాశ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు కేజీ గంగాధరరెడ్డి హాజరై సరోజిని నాయుడు చేసిన సేవలను కొనియా డారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉప గ్రంథాలయ అధికారి వి.పెద్దక్క, లైబ్రేరియన్లు బాషా, వజ్రాల గోవిందరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 12:25 AM