పారిశుధ్యానికి ప్రాధాన్యమివ్వాలి
ABN , Publish Date - Jul 25 , 2025 | 12:59 AM
గ్రామాల్లో పారిశుధ్యానికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ సీఈవో నాసరరెడ్డి అధికారులకు సూచించారు.
నందికొట్కూరు రూరల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యానికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ సీఈవో నాసరరెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని శాతనకోట, అల్లూరు గ్రామాల్లో గురువారం ఎంపీడీవో సుబ్రహ్మణ్యశర్మ తో కలిసి పర్యటించారు. డ్రైనేజీలను, నీళ్ల ట్యాంకులను పరిశీలించారు. గ్రామ సెక్రటరీ రహీంను పరిశుభ్రత గురించి, నీళ్ల ట్యాంకులను ప్రతి వారం శుభ్ర పరుస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణపై ఆరా తీశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.