Share News

ఆర్టీ‘ఛీ’ అధికారులు

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:20 AM

ప్రయాణికులకు మెరగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాల్సిన ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గురువారం ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

ఆర్టీ‘ఛీ’ అధికారులు
రాత్రి 7.15 గంటలకు బస్సు ఎక్కేందుకు ప్రయాణికుల అవస్థలు

కర్నూలుకు బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు

నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన డిపో మేనేజర్‌

ఆదోని అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులకు మెరగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాల్సిన ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గురువారం ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆదోని నుంచి కర్నూలుకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7:00 వరకు ప్రయాణికులు పడిగాపులు కాశారు. బసుసలు వేయాలని డిపో మేనేజర్‌కు పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో డీఎం మహమ్మద్‌ రఫీను వివరణ కోరగా బస్సులు ఉన్నాయని, లేరని ఎవరు చెప్పారంటూ చిందులు వేశారు.

Updated Date - Feb 07 , 2025 | 12:20 AM