ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:02 AM
పట్టణంలోని ప్రధాన రహదారులలో కాలువలపై ఆక్రమణల తొలగింపును మున్సిపల్ అధికారులు తొలగింపును పట్టణ ప్రణాళిక అధికారులు గురువారం ప్రారంభించారు.

ఆదోని టౌన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రధాన రహదారులలో కాలువలపై ఆక్రమణల తొలగింపును మున్సిపల్ అధికారులు తొలగింపును పట్టణ ప్రణాళిక అధికారులు గురువారం ప్రారంభించారు. శ్రీనివాస భవన్ నుంచి కాలువలపై ఏర్పాటు చేసుకొన్న కట్టడాలు, వ్యాపారుల సామానులు, షో కేసులను తొలగించారు. అయితే ఫుట్పాత్ వ్యాపారులు తమకు గడువు కావాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణను కోరగా, ఆయన అంగీకరించలేదు. ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఆక్రమణలను ఇకపై ఉపేక్షించేది లేదని కమిషనర్ సమాధానం ఇచ్చారు. గణేష్ సర్కిల్ వరకు ఆక్రమణల తొలగింపు ఉంటుందని, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సహకరించాలని పనులను పర్యవేక్షిస్తున్న టీపీవో బాల మద్దయ్య కోరారు. ఆక్రమణల తొలగిపుపై వారం రోజుల నుంచి నోటీసులు ఇచ్చామని, ఆక్రమణలను యజమానులే తొలగించుకొని సహకరించాలని కోరారు.