స్వచ్ఛతే లక్ష్యంగా పని చేయాలి
ABN , Publish Date - Feb 15 , 2025 | 10:51 PM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో స్వచ్ఛతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజకుమారి గనియా పిలుపునిచ్చారు.

కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లె, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో స్వచ్ఛతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజకుమారి గనియా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్తోపాటు కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్, కార్యాలయంలోని సెక్షన్ల గదులను శుభ్రం చేశారు. స్వచ్ఛ జిల్లాగా రూపొందించడంలో ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.