Share News

నందీశ్వరుడికి ప్రదోషకాల పూజలు

ABN , Publish Date - May 24 , 2025 | 11:55 PM

వైశాఖ బహుళ త్రయోదశి మహాప్రదోషం పురష్కరించుకొని మహానంది క్షేత్రంలోని రాతి నందీశ్వరుడికి ప్రదోషకాల పూజలు, అభిషేకం వేదపండితులు ఘనంగా నిర్వహించారు.

నందీశ్వరుడికి ప్రదోషకాల పూజలు
మహానందిలో నందీశ్వరుడికి పూజలు చేస్తున్న వేదపండితులు

మహానంది, మే 24(ఆంధ్రజ్యోతి): వైశాఖ బహుళ త్రయోదశి మహాప్రదోషం పురష్కరించుకొని మహానంది క్షేత్రంలోని రాతి నందీశ్వరుడికి ప్రదోషకాల పూజలు, అభిషేకం వేదపండితులు ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం ప్రధాన ఆలయం ముందు భాగంలోని నందీశ్వరుడికి వేదపండితుడు రవిశంకర్‌ అవధాని ఆధ్వ ర్యంలో వేదమంత్రాలతో ప్రదోషకాల పూజలను జరిపారు. కార్యక్రమంలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ పసుపుల సుబ్బారెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 11:55 PM