Share News

గజ వాహనంపై ప్రహ్లాదరాయలు

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:30 AM

రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి గజవాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చారు.

గజ వాహనంపై ప్రహ్లాదరాయలు
గజ వాహనంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి గజవాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చారు. ధనుర్మాసం సోమవారం సప్తమిని పుర స్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులతో తెల్లవారుజాము నుంచే రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి, మంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత కాంతుల మధ్య గజవాహనం ఊరేగుతుండగా భక్తులు జయహో... గురు రాఘ వేంద్ర.. విజయహో.. అంటూ పెద్దఎత్తున జయద్వనులతో మఠం ప్రాంగణం మార్మోగింది. పండితులు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులకు ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.

Updated Date - Jan 07 , 2025 | 12:30 AM