వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Feb 11 , 2025 | 11:25 PM
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ జనార్దన్రెడ్డి ఆదేశించారు.
డీఈఓ జనార్దన్ రెడ్డి
జూపాడుబంగ్లా, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ జనార్దన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం జూపాడుబంగ్లా, ఆత్మకూరు మండలాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలపై భయం వీడాలని ఆయన విద్యార్థులకు సూచించారు. విద్యార్థులను విభజించి సీ గ్రేడు ఉన్న విద్యార్థులను ఏ గ్రేడులోకి తీసుకొచ్చి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఉత్తీర్ణత శాతం తక్కువ వచ్చే పాఠశాలలు, ఆయా అధికారులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.