Share News

మహానందీశ్వరుడి సన్నిధిలో న్యాయాధికారి

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:56 AM

మహానంది క్షేత్రంలో బుధవారం నంద్యాల జిల్లా న్యాయాధికారి అమ్మణ్ణ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహానందీశ్వరుడి సన్నిధిలో న్యాయాధికారి
న్యాయాధికారికి జ్ఞాపికను అందజేస్తున్న ఆలయ అధికారులు

మహానంది, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో బుధవారం నంద్యాల జిల్లా న్యాయాధికారి అమ్మణ్ణ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో తెల్లవారుజామున జరిపే ప్రాతఃకాల హారతి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకాభిషేక పూజలను జరిపారు. కల్యాణ మంటపంలో వేదపండితులు ఆశీర్వదించారు. స్వామి వారి మెమెంటోను ఆలయ పర్యవేక్షకుడు శశిధర్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:56 AM