Share News

క్రీ డా సామగ్రి పంపిణీ

ABN , Publish Date - May 15 , 2025 | 12:23 AM

జిల్లాలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన క్రీడా పరికరాలను బుధవారం కలెక్టర్‌ రాజకుమారి పంపిణీ చేశారు.

 క్రీ డా సామగ్రి పంపిణీ
క్రీడా పరికరాలను పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల హాస్పిటల్‌, మే 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన క్రీడా పరికరాలను బుధవారం కలెక్టర్‌ రాజకుమారి పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం, శాప్‌ ఆధ్వర్యంలో 50 వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నా మన్నారు. 8నుంచి 14ఏళ్ల చిన్నారులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈశిబిరం ఉపయోగపడుతుం దన్నారు. ప్రతి శిబిరానికి రూ.5వేల విలువచేసే క్రీడాపరికరాలు క్యాంప్‌ ఇన్‌చార్జికి రూ.1,500 గౌరవ వేతనం, క్యాంప్‌ నిర్వహణ నిమిత్తం రూ.500 ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. శిబిరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇస్తామ న్నారు. శిక్షణ తీసుకోవాల్సిన ఆసక్తిగల విద్యార్థులు క్రీడా యాప్‌ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎంఎన్‌వీ రాజు, శిక్షకులు, క్యాంప్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 12:23 AM