నేటి నుంచి క్రికెట్ టోర్నమెంట్
ABN , Publish Date - May 09 , 2025 | 01:21 AM
ఈనెల 15న మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 9 నుంచి ఎస్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు 33వ వార్డు ఇన్చార్జి జోసఫ్, సాయి, మధు, ధనరాజ్ తెలిపారు.

నంద్యాల రూరల్, మే 8(ఆంధ్రజ్యోతి): ఈనెల 15న మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 9 నుంచి ఎస్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు 33వ వార్డు ఇన్చార్జి జోసఫ్, సాయి, మధు, ధనరాజ్ తెలిపారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో బ్రోచర్లను టీడీపీ నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ మొదటి బహుమతి రూ.60 వేలు, రెండో బహుమతి రూ.40వేలు, ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.