Share News

‘విద్యారంగ సంస్కరణలతో గందరగోళం’

ABN , Publish Date - May 10 , 2025 | 01:14 AM

పాఠశాల విద్యారంగంలో సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గందగోళ పరిస్థితులను నెలకొల్పిందని ఏఫీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్‌ అన్నారు.

‘విద్యారంగ సంస్కరణలతో గందరగోళం’
ధర్నా చేస్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

నంద్యాల నూనెపల్లె, మే 9(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యారంగంలో సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గందగోళ పరిస్థితులను నెలకొల్పిందని ఏఫీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ , ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజ నాలకై ఎఫీటీఎఫ్‌ రాష్ట్ర సమితి నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. రవికుమార్‌తో పాటు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలు నెలకొల్పితే ఈ ప్రభుత్వం 9 రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేఖిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1 నుంచి 5 తరగతులకు వరకు మోడల్‌ ప్రాధమిక పాఠశాలలు, బేసిక్‌ ప్రాఽథమిక పాఠశాలలుగా కొనసాగించాలని డిమాండు చేశారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో తరగతులను బట్టి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు జీవో నెం 55 ప్రకారం కొనసాగించాలని డిమాండు చేశారు. ఆంగ్ల మాధ్యమానికి సమానంగాత ెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని , సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పద్ధతి కొనసాగించాలన్నారు. బదిలీలు, పదోన్నతులకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని కొనసాగించాలని 12వ పీఆర్సీ వెంటనే నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండు చేశారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 14వ తేదిన విజయవాడలోని ధర్నాచౌక్‌లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. డీఆర్వో రామునాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఏపీటీఎఫ్‌ నాయకులు బాస్కర్‌రెడ్డి, జాకీర్‌హుసేన్‌, మధు, రమేశ్‌, శైలజ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 01:14 AM