Share News

‘బెస్ట్‌’ అవార్డు అందుకున్న కలెక్టర్‌

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:42 PM

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును అందుకున్నారు.

‘బెస్ట్‌’ అవార్డు అందుకున్న కలెక్టర్‌
బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును అందుకున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. బాపట్ల కలెక్టర్‌గా 2024లో ఓటర్ల జాబితా తయారీ, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తదితర అంశాల్లో సమర్థవంతంగా పని చేసినందుకు ఎన్నికల కమిషన్‌ పి.రంజిత్‌ బాషాకు అవార్డును అందజేసింది.

Updated Date - Jan 25 , 2025 | 11:42 PM