‘బెస్ట్’ అవార్డు అందుకున్న కలెక్టర్
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:42 PM
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును అందుకున్నారు.

కర్నూలు కలెక్టరేట్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. బాపట్ల కలెక్టర్గా 2024లో ఓటర్ల జాబితా తయారీ, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తదితర అంశాల్లో సమర్థవంతంగా పని చేసినందుకు ఎన్నికల కమిషన్ పి.రంజిత్ బాషాకు అవార్డును అందజేసింది.