ప్రశాంతంగా పాలీసెట్
ABN , Publish Date - May 01 , 2025 | 12:01 AM
నంద్యాల జిల్లాలో 22 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పాలీసెట్ ప్రవేశపరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది.
నంద్యాల ఎడ్యుకేషన్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో 22 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పాలీసెట్ ప్రవేశపరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు జిల్లాలో 5,682 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 5120మంది హాజరు కాగా, 562 మంది గైర్హాజరైనట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రి న్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ప్రసాద్ తెలిపారు. బనగానపల్లె, శ్రీశైలం, బేతంచర్ల పట్టణాల్లోని కళాశాల ల్లో సైతం పరీక్షలు నిర్వహించారన్నారు.